Feroze Khan: సీఎంపై ఒవైసీ ప్రశంసలు.. మరుసటి రోజే ఫిరోజ్ ఖాన్ సీరియస్ కామెంట్స్

by Prasad Jukanti |
Feroze Khan: సీఎంపై ఒవైసీ ప్రశంసలు.. మరుసటి రోజే ఫిరోజ్ ఖాన్ సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను స్నేహితులం అని, కాంగ్రెస్ ప్రభుత్వంతో మాకు దోస్తీ ఉందని శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఎంఐఎంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫిరోజ్ ఖాన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలరని, బంగారు తెలంగాణ కావాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు.

తాను మళ్లీ చెబుతున్న అసదుద్దీన్ ఒవైసీ బీజేపీకి బీ టీమ్ అన్నారు. ఇందుకు ఉదాహరణ పార్లమెంట్ లో జై పాలస్తీనా అనడమే నిదర్శనం అన్నారు. అమిత్ షా చెప్పడం వల్లే అసద్ పార్లమెంట్ లో ఆ రకంగా స్లోగన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. అమిత్ షా, ఒవైసీ మధ్య ఓ డ్రామా నడుస్తున్నదన్నారు. ఎంఐఎం బీ-టీమ్ అని మా లీడర్లు ఒప్పుకోకపోయినా ప్రజలు, స్థానికులకు అంతా అర్థం అయిపోయిందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి కాళ్ల వద్ద ఉంటారని ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన చేరారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైన తర్వాత రేవంత్ రెడ్డి వీరిని పంపించేస్తారన్నారు.

ఎంఐఎం ఒక వద్ద స్థిరంగా ఉండదన్నారు. గడిచిన పదేళ్లు కేసీఆర్ వెంట నడిచిన ఒవైసీ వారం రోజుల్లోనే కాంగ్రెస్ వైపు వచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ సచ్చిన పాము అని రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చేస్తారన్నారని బీఆర్ఎస్ లో ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా అంతా వచ్చేస్తారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటబోతున్నదని ధీమా వ్యక్తం చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed