- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్ల రిపేర్లకి రూ.1,150 కోట్లు అవసరం : ఆర్&బీ అధికారుల సమగ్ర నివేదిక
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజుల పాటు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని రోడ్లన్ని తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. సుమారు రూ.1,134.58 కోట్ల మేర ఆర్&బీ శాఖ పర్యవేక్షిస్తున్న రోడ్లకి నష్టం వాటిల్లిందని ఆ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా అంచనా వేశారు. 510 ప్రదేశాల్లో రోడ్లు ధ్వంసం అవడంతో తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, అందులో 336 ప్రదేశాల్లో ఇప్పటికే ఆ అంతరాయాన్ని స్థానిక అధికారుల సాయంతో తొలగించినట్టు తెలిపారు. మొత్తంగా 559 రోడ్లలో నీటి ఓవర్ ఫ్లో అయినట్టు, ఇందులో 331 ప్రదేశాల్లో తాము క్లియర్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 82 రోడ్ బ్రీచ్ లను గుర్తించగా, అందులో 8 క్లియర్ చేశామని . రోడ్ల విభాగ ఉన్నతాధికారులు వివరించారు. వీటి అన్నింటిని తక్షణమే రిపేర్ చేసేందుకు రూ.255.63 కోట్లు అవసరం అవుతాయని ఆర్&బీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. శాశ్వత ప్రాతిపదికన రిపేర్ చేయాలంటే రూ.1,150 కోట్లు కావాలని సూత్రప్రాయంగా ప్రభుత్వానికి ఆర్&బీ ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం.