Ravneet Singh: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం పూర్తి : రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్

by Shiva |   ( Updated:2024-08-24 13:38:45.0  )
Ravneet Singh: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం పూర్తి : రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అతి త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ అందుబాటులోకి రాబోతోందని రవ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed