కల్లు కాంపౌండ్ పైకి దూసుకొచ్చిన కారు.. పల్టీలు కొట్టిన వైనం

by Nagam Mallesh |
కల్లు కాంపౌండ్ పైకి దూసుకొచ్చిన కారు.. పల్టీలు కొట్టిన వైనం
X

దిశ, తలకొండపల్లిః మండలంలోని వెల్జాల్ గ్రామ సమీపంలో రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న మూలమలుపు దగ్గర ఉన్న కల్లు దుకాణం మీదకు ఓ కారు దూసుకొచ్చింది. వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. మిడ్జిల్ మండల కేంద్రం నుండి వెల్జాల్ గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రామసుపల్లి మైసమ్మ దేవాలయం వద్ద డేంజర్ మలుపు ఉండడం వల్ల గత మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనం ఢీకొని ఇద్దరు మృతి సంఘటన మర్చిపోకముందే మరో కారు పల్టీలు కొట్టింది. కానీ అక్కడున్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు. అతివేగంతో కారు నడిపిన వ్యక్తి జడ్చర్ల మండలంలోని మురుగుపల్లి పెద్ద తండా కు చెందిన కేతావత్ రమేష్ గా గుర్తించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed