కుల్కచర్ల కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

by Aamani |
కుల్కచర్ల  కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
X

దిశ,కుల్కచర్ల : కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన విద్యార్థులు వార్డెన్ కు సమాచారం అందించగా వెంటనే ప్రభుత్వ పరిగి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని తండ్రితో చెప్పగా అక్కడే ఉండమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు.

Next Story

Most Viewed