కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే.. చేరికకు నేడు ముహూర్తం ఖరారు

by Shiva |
కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే.. చేరికకు నేడు ముహూర్తం ఖరారు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయము 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. చేరిక విషయమై ఎమ్మెల్యేను వివరణ కోరగా శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని క్లారిటీ ఇచ్చారు. రెండు నెలలుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగినా.. పలు కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.

మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో‌కి రావడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేయడంతో పాటు ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు జరిపిన ప్రయోజనం లేకపోయింది. దీనితో నడిగడ్డ రాజకీయాలు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed