పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కి అలా బిహేవ్ చేశాడు. వాళ్లు నన్ను వాడుకొని వదిలేశారు.. షకీలా సంచలన కామెంట్స్

by Kavitha |
పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కి అలా బిహేవ్ చేశాడు. వాళ్లు నన్ను వాడుకొని వదిలేశారు.. షకీలా సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పుడు బోల్డ్ పాత్రలో నటించి.. టాలీవుడ్ శృంగార తారగా ముద్ర వేసుకున్న నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడల్ట్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీని ఏ ఊపు ఊపిందనని చెప్పుకోవచ్చు. స్టార్‌డమ్ తగ్గాక పలు సినిమాల్లో కామేడీ రోల్‌లో మెరిసింది. ఇక బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా పాల్గొని అనూహ్యంగా 2వ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా బిగ్ బాస్ గురించి, గత సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో సీజన్ 7 లో కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి టైటిల్ విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌పై మాత్రం ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.

ఆమె మాట్లాడుతూ.. హౌస్‌లో నేను ఉన్నప్పుడు నాకు ప్రియాంక, అమర్ దీప్ , దామిని , సందీప్ మాత్రమే నిజాయితీ పరులుగా అనిపించారు. వారిలో నాకు ఎలాంటి తప్పులు కనిపించలేదు. ముఖ్యంగా వాళ్లలో నేను నిజాయితీ చూసాను. ఇక పల్లవి ప్రశాంత్ నన్ను ఏం చేసిన ఐ డోంట్ కేర్. అతడు హౌస్‌లోకి పిల్లి లాగా వచ్చి వినయంగా నటించి ఆ తర్వాత కాస్త గుర్తింపు రాగానే తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నది కూడా చూడకుండా కళ్ళు నెత్తికెక్కి యాటిట్యూడ్‌గా బిహేవ్ చేశాడు. ఇక సీనియర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నాకు నచ్చలేదు. అది అతని నిజస్వరూపం అంటూ తెలిపింది షకీలా.

అదేవిధంగా తనని మాత్రం బిగ్ బాస్ లోకి కేవలం పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు, వాళ్ళ అవసరం తీరిపోయాక నన్ను పంపించేశారు. బిగ్ బాస్ వల్ల నాకు ఏదో ఒరుగుతుంది అని నేను రాలేదు. కేవలం పేమెంట్ ఇచ్చారు వచ్చాను. బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే స్టూడియో ఆయనదే, హోస్ట్ ఆయనే కాబట్టి ఆయనకు మాత్రమే లాభం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed