హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

by Kalyani |
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం
X

దిశ, శంషాబాద్ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. దత్తాత్రేయ ఢిల్లీ వెళ్లేందుకు తన కాన్వాయ్ లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శంషాబాద్ వెళుతుండగా… ఫ్లైఓవర్ దాటి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యే సమయంలో తన కాన్వాయ్ వెనుక వస్తున్న మరో వ్యక్తి కారు కాన్వాయ్ ని ఓవర్టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ కారు ముందుకు వెళ్ళిపోయింది. కాన్వాయ్ లోని మిగిలిన రెండు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొనడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story