- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బీజేపీలో చేరికలు లేకపోవడానికి కారణమిదే.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీజేపీలో మాత్రం చేరికలు లేక పోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసే తమ పార్టీకి రావాలనే అంశంలో పునరాలోచనలో పడి కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టి పార్టీలో తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు అంగీ, లాగు మాత్రమే ఉందని అంటున్నారని.. కానీ బయట మాత్రం రూ.వందల కోట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రివర్స్లో ఇచ్చి హస్తం పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. ఆస్తుల పరిరక్షణ, డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. 2014, 2018లో కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేస్తుందని కేటీఆర్ అంటున్నారని.. గతంలో కేటీఆర్ ఎంత ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ప్రశ్నించారు.