Raghunandan Rao : కేటీఆర్ గతంలో ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదు? ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-08-24 09:57:51.0  )
Raghunandan Rao : కేటీఆర్ గతంలో ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదు? ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ తుమ్మిడి చెరువు వద్ద నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారుల కూల్చివేత పై బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 లో హైకోర్టు ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని ఉత్తర్వులు ఇచ్చిందని, ఎందుకు ఇన్నేళ్లు మీనమేషాలు లెక్కపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ చేనేతకు నాగార్జున కోడలును బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం వెనుకున్న మతలబు ఎంటి? 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో ముక్కుపిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చిన పదేళ్లు అప్పటి మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎందుకు తొలగించలేదని నిలదీశారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.

పార్టీ అని తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జొన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలని 2010 లోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 లో మీరాలం ట్యాంక్ అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు. ఈ రోజు మీరాలం ట్యాంక్ ఉందా? అక్కడ ఎంఐఎం వాళ్లకి కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందని, రేవంత్ వెళ్లి చూద్దాం రండి అని సవాల్ చేశారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

మీ బీఅర్ఎస్ ఎమ్మెల్యేల ఇల్లు లేవా? హరీష్, కవిత, కేటీఆర్‌కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు కాపాడుతున్నారు? ముందు ముగ్గురు ఇల్లు కులగొట్టండని డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్ కొట్టడానికి రేవంత్ కు భయమెందకన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయపడకుండా మీ జేసీబీలతో మీరాలం ట్యాంక్ దగ్గరికి రావాలని సూచించారు. కేసీఆర్ హయాంలో జరిగిన నయీం ఎన్ కౌంటర్ కేసు, మియాపూర్ భూముల కేసు, డ్రగ్స్ కేసు ఎక్కడికి పోయిందన్నారు. ఇద్దరు హయంలో చెరువులపై ఆక్రమణకు గురైన భూముల మీద శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ అని ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నారని, నేడు ఎందుకు దానికి కూలగొట్టడం లేదని అన్నారు. కండువాలు మార్చమని బెదిరించేందుకే కూల్చివేతలని ఆరోపించారు. ఈ ప్రభుత్వం చెరువుల వద్ద సీసీ కెమెరాల కోసం 480 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోనేలు గుర్తించడానికి మీకెంత సమయం కావాలని ప్రశ్నించారు. రేవంత్, హైడ్రా కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలన్నారు. వీటికి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లు గుర్తించాలన్నారు. రాజ్ భవన్ రోడ్డులో నాలపై బంగ్లాలు కట్టడం బాధాకరమన్నారు. కేటీఆర్ హయాంలో కట్టిన అక్రమ నిర్మాణాలను తానే బాధ్యత వహిస్తూ కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

నటుడు నాగార్జున ఇచ్చిన వివరణపై రఘునందన్ రావు మాట్లాడుతూ.. కోర్టు ఎన్ కన్వేషన్ మీద స్టే ఎలా ఇస్తుంది ? అని ప్రశ్నించారు. బరా బర్ కూలగొట్టాల్సిందేనని అన్నారు. కోర్టు కి నేను విజ్ఞప్తి చేస్తున్న.. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో తీర్పు ఇచ్చిన జడ్జిమెంట్ చూడాలన్నారు. మీరు స్టే ఇస్తున్నారు అంటే గతంలో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలను మీరు అవమానిస్తున్నారా? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇచ్చారు ? ఇది కరెక్ట్ కాదు.. ఏ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసి అధికారం పంచాయతీ కార్యదర్శులకు ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed