Patnam Mahender Reddy: అక్రమమైతే దగ్గరుండి నేనే కూల్చేస్తా.. కేటీఆర్ కు పట్నం కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-08-27 15:47:46.0  )
Patnam Mahender Reddy: అక్రమమైతే దగ్గరుండి నేనే కూల్చేస్తా.. కేటీఆర్ కు పట్నం కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తాను గెస్ట్ హౌస్ నిర్మించుకున్నానని, నేను ఎలాంటి చెరువు భూమిని కబ్జా చేయలేదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కు సంబంధించి ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని వస్తున్న ఆరోపణలపై మంగళవారం పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తన గెస్ట్ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. పట్టాభూమిలోనే నా గెస్ట్ హౌస్ ఉందని ఒక వేళ తన ఫామ్ హౌస్ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉంటే నేనే దగ్గరుండి కూల్చేయిస్తానన్నారు. తన ఫామ్ హౌస్ విషయంలో పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, 111 జీవో పరిధిలో నేనొక్కడినే కాదని చాలా మంది నిర్మాణాలు చేసుకున్నారు. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బడా బడా నేతలు ఉన్నారన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామన్నారు. ఇది 20 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అని తాను ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదన్నారు. రోజూ పత్రికల్లో తన ఫామ్ హౌస్ ప్రస్తావన వస్తుండటంతోనే క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చానన్నారు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాల కూల్చివేతను తాను సమర్థిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story