ఆలూర్ లో దొంగల బీభత్సం

by Sridhar Babu |
ఆలూర్ లో దొంగల బీభత్సం
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో వీధి నెంబర్ 18 లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. బయ్య శివలింగం కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లడంతో ఎవరూ లేని సమయం చూసి దొంగలు శనివారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి బీరువా నుండి రెండు తులాల బంగారం, 10,500 రూపాయల నగదు, విలువైన పట్టు చీరలు, సుమారు 50 వేల విలువైన వెండి, ఇత్తడి సామాను దొంగిలించారు. ఇంటి చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story