ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.

by Sumithra |
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.
X

దిశ, నవీపేట్ : నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మహారాష్ట్ర నుండి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. రాష్ట్రంలో గోదావరి ప్రవేశించే రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నీటిలో శివాలయం మునిగిపోయింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో గోదావరి ప్రవాహ పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దు బ్రిడ్జి త్రివేణి సంగమం వద్ద రెంజల్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed