- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల శివారులో గల అటవీ ప్రాంతంలో బుధవారం ఓ మృతదేహం లాభ్యమైనట్లు నస్రుల్లాబాద్ ఎస్ఐ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి చెందిన జంగంవార్ అంజయ్యగా గుర్తించామని ఆమె తెలిపారు.
మృతుడు ఇంటి నుండి గత ఏడాది డిసెంబర్ నెల 27వ తేదీన వెళ్లిపోయాడని, దీంతో 30వ తేదీన పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలిపారు. కోటగిరి పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారన్నారు. అయితే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో బుధవారం మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మృతుడిది హత్యనా? ఆత్మహత్యనా?
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతుడు ఎవరనేది తెలిసినప్పటికీ అది హత్యనా? లేక ఆత్మహత్యనా? తేలాల్సి ఉంది. మృతుడు జంగంవార్ అంజయ్య ఇంటి నుండి అదృశ్యమై నెల రోజులు కావచ్చిందని, కోటగిరి పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసినప్పటికీ కేసును ఛేదించడంలో విఫలమయ్యారు. కనీసం ఇప్పటికైనా జంగంవార్ అంజయ్యది హత్యనో ? ఆత్మహత్యనో తేల్చాల్సి ఉంది.