న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

by M.Rajitha |
న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్ డెస్క్ : అక్టోబర్ 16 నుండి న్యూజిలాండ్ తో జరగనున్న 3 టెస్టుల సిరీస్ టీమిండియా జట్టును బీసీసీఐ(BCCI) శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఈ మ్యాచులు జరగనున్నాయి. అయితే వైస్ కెప్టెన్ గా బుమ్రా సెలెక్ట్ కాగా, మహ్మద్ షమికి జట్టులో చోటు దక్కలేదు.

జట్టు వివరాలు ఇవే..

రోహిత్ శర్మ, బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షరపటేల్, కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్. కాగా హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ద కృష్ణ రిజర్వ్ ప్లేయర్స్ గా ఉండనున్నారు.

షెడ్యూల్ వివరాలు

*మొదటి టెస్ట్ సిరీస్ అక్టోబర్ 16 నుండి 21 వరకు బెంగుళూరు లోని చిననస్వామి స్టేడియంలో జరగనుంది.

*రెండవ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 24 నుండి 28 వరకు పూణే లోని ఎంసీఏ స్టేడియంలో ఉండనుంది.

*మూడవ టెస్ట్ సిరీస్ నవంబర్ 1 నుండి 5 వరకు పూణే లోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed