- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆ భూమి నాది ....భాజపా నాయకుడి దౌర్జన్యం
దిశ, గాంధారి : గ్రామపంచాయతీ పురాతన భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించదల్చుకున్న గ్రామస్తులకు ఓ బీజేపీ నేత ఈ స్థలం నాదంటూ గ్రామస్తులకు షాక్ ఇచ్చాడు. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి తమ నిరసన తెలిపిన సంఘటన గాంధారిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని శుక్రవారం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చివేసి నూతన గ్రామపంచాయతీ నిర్మాణ ప్రక్రియ చేపడుతున్న తరుణంలో ఈ స్థలం నాది అంటూ
కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా భాజపా అధ్యక్షుడు పోతంగల్ కిషన్ రావు అడ్డుపస్తున్నాడని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయితే ఇప్పటివరకు గ్రామపంచాయతీ స్థలం గ్రామానికి చెందింది ఉండగా ఇప్పుడు కొత్తగా పోతంగల్ కిషన్ రావు వచ్చి ఈ స్థలం నాదే అని అంటున్నారని, అంతేకాకుండా నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కావలసిన బిల్లులను కిషన్ రావు కావాలని ఆపుతున్నాడని, అధికారులు స్పందించి తమ సమస్య తీర్చే వరకు ఇక్కడి నుండి జరిగేది లేదని గ్రామస్తులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ దగ్గర గ్రామ పంచాయతీకి సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని గ్రామస్తులు హెచ్చరించారు.