ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు

by Kalyani |
ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలలో స్వీయ సహాయ గ్రూపుల (ఎస్ హెచ్ జి ఎస్) నుండి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులను చేర్చాలన్నారు. కమిటీలు స్థానిక ప్రజలకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని, లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో అవసరమైన సహాయాన్ని అందించడం, తప్పులైతే వాటిని గుర్తించడం కూడా కమిటీల బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story