గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
గడ్డిమందు తాగి వ్యక్తి  ఆత్మహత్య
X

దిశ, గొల్లపల్లి : జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గడ్డం జలంధర్ రెడ్డి (38) ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య గడ్డం రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story