పాన్ షాప్ పై టాస్క్ ఫోర్స్ దాడి

by Sridhar Babu |
పాన్ షాప్ పై టాస్క్ ఫోర్స్ దాడి
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని ఓ పాన్ షాప్ పై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. గురువారం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్ ఆధ్వర్యంలో నగరంలోని గుర్భ బాది రోడ్ ఏరియాకి చెందిన కోరి కమల్ సింఘ్ పాన్ షాపులో తనిఖీ చేయగా 550 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దానిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కమల్ సింగ్ ను అరెస్ట్ చేసి ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ లో అప్పజెప్పారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ విలాస్, ఎస్ఐ గంగాధర్ , సిబ్బంది సలీం, సాగర్ రావ్, గోపి, కార్తిక్, కిరణ్ కుమార్, నీలిరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed