బడిపిల్లలా....బాలకార్మికులా...

by Sridhar Babu |
బడిపిల్లలా....బాలకార్మికులా...
X

దిశ, కోటగిరి : స్నేహ సొసైటీ ద్వారా యువతీయువకులకు రుణాలపై అవగాహనా కల్పించం కోసం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులు పనిమనుషులుగా మారారు. ప్రధాన మంత్రి అందిస్తున్న రుణాలపై నూడల్ ఆఫీసర్ రాజ్ కుమార్ యాదవ్ అవగాహన కల్పిస్తున్న సమయంలో పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు సమావేశానికి హాజరైన వారికి టీలు, బిస్కెట్లు అందించారు. అలాగే విద్యార్థులు ఈ కార్యక్రమంలో టీ, బిస్కెట్లతో పాటు కుర్చీలను తమ శక్తికి మించి మోసుకొని రావడం గమనార్థం. దాంతో విద్యార్థులతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed