- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
గంజాయి తాగలేదని తోటి విద్యార్థిని చితకబాదిన విద్యార్థులు
by Sridhar Babu |
X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో గంజాయి కలకలం నెలకొంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి గంజాయి తాగలేదని మిగతా విద్యార్థులు అతడిని చితక బాదిన సంఘటన కలకలం రేపింది. గంజాయి తాగాలని ఆ విద్యార్థిని బలవంతం చేయడంతో ఆ విద్యార్థి ససేమిరా తీసుకోక పోవడంతో తోటి విద్యార్థులంతా కలిసి గంజాయి సేవించని ఆ విద్యార్థిని చితకబాదారు. ఈ దాడిలో గాయపడిన విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఆ విద్యార్థి తరపు వ్యక్తుల నుంచి మాక్లూర్ పోలీసులు ఫిర్యాదు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story