Tripura : పర పురుషులతో ఫొటోలు దిగిందని.. భార్య దారుణ హత్య

by Hajipasha |
Tripura : పర పురుషులతో ఫొటోలు దిగిందని.. భార్య దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వ్యక్తి తన భార్య, అత్తను పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం త్రిపురలోని పశ్చిమ త్రిపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి (51) సెఫాహిజాలా జిల్లా మధుపూర్ గ్రామస్తుడు. అతడొక పౌల్ట్రీ రైతు. ఏడాదిన్నర క్రితం ఆ వ్యక్తిని భార్య వదిలేసి వెళ్లిపోయింది. విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. ప్రస్తుతం సదరు వ్యక్తి భార్య పుట్టినింటిలో ఉంది.

తాజాగా దసరా పండుగ రోజు ఆమె ఇద్దరు పురుషులతో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. వాటిని చూసిన భర్త కోపంతో ఊగిపోయాడు. వెంటనే పశ్చిమ త్రిపుర జిల్లాలోని తన అత్తవారింటి ఏరియాకు చేరుకున్నాడు. భార్య, అత్త కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అడ్డగించి.. కత్తితో దాడి చేసి పాశవికంగా హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాాడు. పోలీసులు గంటలోనే సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story