డివైడర్ ను ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి

by Sridhar Babu |
డివైడర్ ను ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు దుర్మరణం చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామకృష్ణాపూర్ కు చెందిన కామిశెట్టి కిరణ్ కుమార్ (50) అనే సింగరేణి కార్మికుడు బైక్ పై బెల్లంపల్లి నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కిరణ్ కుమార్ కాసిపేట - 2 గనిలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed