ముగిసిన సెలవులు... భాగ్యనగరానికి పరుగులు

by Sridhar Babu |
ముగిసిన సెలవులు... భాగ్యనగరానికి పరుగులు
X

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ దసరా వేడుకలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నుంచి చాలామంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని తమ సొంత ప్రాంతాలకు వచ్చారు. ఆదివారంతో సెలవులు ముగియడంతో అందరూ రాజధానికి పరుగులు పెడుతున్నారు. రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉండడంతో టోల్ ప్లాజా వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాహనాల సంఖ్య భారీగా ఉండడంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు టోల్ ప్లాజా సిబ్బంది కూడా వెంటనే వాహనాలను పంపించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయని పలువురు వాహనదారులు ఆరోపించారు. పండుగ వేళల్లో టోల్ ప్లాజాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story