రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం : మాజీ మంత్రి షబ్బీర్ అలీ

by Sumithra |
రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం : మాజీ మంత్రి షబ్బీర్ అలీ
X

దిశ, పిట్లం : రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కలుగుతుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం పిట్లం మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజీవ్ పాదయాత్ర గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రాహుల్ పాదయాత్రకు సంబంధించిన వాల్ పెయింటింగ్, బ్యానర్ లతో ప్రచారం చేయాలని దండోరా వేయించాలని అన్నారు. జిల్లా కేంద్రాలలో భారీ హోల్డింగ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జుక్కల్ నియోజక వర్గంలో పాదయాత్ర ప్రవేశించి సుమారు 70 కిలోమీటర్ల యాత్ర కొనసాగడం జుక్కల్ నియోజక వర్గ నాయకుల ప్రాంత ప్రజల అదృష్టం అని అన్నారు.

ప్రతి ఒక కాంగ్రెస్ కార్యకర్త తనవంతు బాధ్యతగా తీసుకొని పాదయాత్రను విజయవంతం చేయాలని అన్నారు. జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి వద్ద పాదయాత్ర ప్రవేశిస్తుందని, ప్రతి రోజు ఉదయం 6:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుందని, పాదయాత్ర వెంబడి కనీసం 5000 మంది ఉండేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ఓం శాంతి గంగారాం, సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు, గడుగు గంగాధర్, సురేష్ షెట్కార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed