‘ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా పండిత్ వినితనే కొనసాగించాలి’

by Rajesh |
‘ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా పండిత్ వినితనే కొనసాగించాలి’
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీలో ఈనెల 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మానం వీగి పోయినందున తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిత్ వినిత నే కొనసాగించాలని మున్సిపల్ కౌన్సిలర్లు బాదం రాజ్ కుమార్, ప్రొద్దుటూరి మురళీధర్ రెడ్డి, నాయకుడు పండిత్ పవన్‌లు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడిని కలిపి 37 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈనెల 4న జరిగిన అవిశ్వాస పరీక్షలో 37 మందిలో 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారన్నారు.

ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తటస్థంగా ఉన్నారని వివరించారు. ఈ అవిశ్వాస పరీక్షలో 2/3 వంతు మెజార్టీతో నెగ్గాలంటే 25 మంది సభ్యులు బలపరిస్తే అవిశ్వాసం నెగ్గేదన్నారు. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినందున అవిశ్వాస తీర్మానం విగిపోయిందన్నారు. ఈ విషయాన్ని తాము జిల్లా కలెక్టర్ కు సైతం వివరించినట్లు చెప్పారు. అవిశ్వాసం విగిపోయినందున మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిత్ వినీత నే కొనసాగించాలని వారు కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పండిత్ వినితను మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ తాటి హను మండ్లు, నాయకులు పింజ తలారి చందు, ఎస్ ఆర్ రమేష్, లింగంపల్లి శివ, పండిత్ ప్రేమ్, రింగుల భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed