గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

by Sridhar Babu |
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
X

దిశ, జక్రాన్ పల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. మండలంలోని అర్గుల్ గ్రామ శివారు లో మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి పైన శ్రీదేవి కోల్డ్ స్టోరేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. డొంకేశ్వర్ మండలం నూత్ పల్లి గ్రామానికి చెందిన కానూర్ గంగాధర్(35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంలో మృతుని భార్య కానూరి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed