పెట్రోల్ పోసుకొని ఒకరి ఆత్మహత్య

by Sridhar Babu |
పెట్రోల్ పోసుకొని ఒకరి ఆత్మహత్య
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బండి గంగాధర్ (64) మానసిక పరిస్థితి సరిగా లేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. మానసిక స్థితి బాగా లేక కుటుంబ సభ్యులతో సఖ్యత లేక మనోవేధనతో గంగాధర్ విద్యానగర్ కాలనీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న మృతుడు గత రెండు నెలల క్రితం హత్య చేసిన ఘటనలో నిందితునిగా జైలు శిక్ష అనుభవించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ తెలిపారు. మృతుడు డయాలసిస్ రోగి కావడంతో బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేనిది, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

Advertisement

Next Story