బస్వాపూర్ సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం

by Sridhar Babu |
బస్వాపూర్ సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం
X

దిశ, భిక్కనూరు : భిక్కనూరు మండలం బస్వాపూర్ సొసైటీ చైర్మన్ భూరు కిష్టా గౌడ్ పై అవిశ్వాసం పెట్టాలని12 మంది పాలకవర్గ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు పాతూరి రాజిరెడ్డి, జి.సుధాకర్ రెడ్డి, నాగన్న గారి మల్లారెడ్డి, మోతె కిష్టారెడ్డి, మద్ది స్వామి, ఏ. నర్సింలు, జి. రాంరెడ్డి, బైండ్ల సుదర్శన్, ఎం. రాజిరెడ్డి, బాల సుమిల,

అనురాధలు మంగళవారం నిజామాబాద్ వెళ్లి డీసీఓ కు నోటీసు అందజేశారు. అయితే సొసైటీ చైర్మన్ తో పాటు, డీసీసీబీ డైరెక్టర్ గా కొనసాగుతున్న కిష్టాగౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డైరెక్టర్లతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సొసైటీ డైరెక్టర్లు ప్రత్యేక సమావేశమై అవిశ్వాస నోటీసు అందజేశారు. అయితే అవిశ్వాసానికి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అధికారులు ప్రకటించిన డేట్ ప్రకారం, చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed