హరియానా ఎన్నికల ఫలితాలపై వైరల్ అవుతున్న రాబర్ట్ వాద్రా పోస్ట్

by M.Rajitha |   ( Updated:2024-10-08 11:43:20.0  )
హరియానా ఎన్నికల ఫలితాలపై వైరల్ అవుతున్న రాబర్ట్ వాద్రా పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)ను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హరియాణా(Hariyana), జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డప్పటికీ.. రెండు చోట్ల తలా ఒక పార్టీ విజయ కేతనం ఎగరవేయబోతోంది. అయితే హరియాణాలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్(Congress) కు భారీ షాక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు. గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా కాంగ్రెస్ పార్టీకి హరియాణాలో జరిగిన పరాభవంపై.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. "ప్రజలు ఏది కోరుకుంటే దానిని అంగీకరించండి. వారు ఎవరి వైపు ఉన్నారో వారితోనే రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకొనివ్వండి. మీరు దేశం గురించి ఆలోచించండి" అని రాబర్ట్ వాద్రా తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాలు మొదలైనపుడు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. మధ్యాహ్నం వరకు బీజేపీ అనూహ్య ఆధిక్యాన్ని దక్కించుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 46 స్థానాలు దాటి ముందుకు వెళుతోంది.

Advertisement

Next Story