అమ్మవారి సేవలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్

by Mahesh |
అమ్మవారి సేవలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దేవి పూజ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. దేవి నవరాత్రుల సందర్భంగా ఇందూర్ నగరంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో దసరా, దేవినవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకోవడం, దసరా పండుగకు ముందు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించి భక్తి శ్రద్దలతో ఒక్కో రోజు, ఒక్కో రూపంలో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రత్యేకమని ఎమ్మెల్యే అన్నారు. అమ్మ ఆశీర్వాదంతో ఇందూర్ జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ లో పాల్గొని భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి మండపం నిర్వాహకులు, భక్తులు, బీజేపీ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story