నిజామాబాద్ రూరల్ ను అభివృద్ధి చేస్తా

by Sridhar Babu |
నిజామాబాద్ రూరల్ ను అభివృద్ధి చేస్తా
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ఈ ఎన్నికల్లో విజయం ప్రజలదని, ప్రజలు మార్పు కోరుకున్నారని, ఉద్యమ నాయకునిగా, ఎమ్మెల్సీ గా, డాక్టర్ గా సేవలు అందించిన తనని భారీ మెజారిటీ తో గెలిపించడం సంతోషంగా ఉందని రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. తనమీద నమ్మకంతో టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర పీసీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.

తన కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రూరల్ ను అభివృద్ధిలో నిలుపుటలో కృషి చేస్తానని అన్నారు. లంబాడ సోదరులకు పోడు పట్టాలు ఇప్పించి వారికి అండగా నిలుస్తామన్నారు. మంచిప్పా రిజర్వాయర్ ద్వారా రైతులకు 20-21 ప్యాకేజ్ ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకి చేరువచేసి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారి మార్గదర్శకంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి అయ్యేలా నిధులు తీసుకువస్తానన్నారు.

Next Story

Most Viewed