పోస్టల్ ఉద్యోగి .. అనుమానాస్పద మృతి

by Kalyani |
పోస్టల్ ఉద్యోగి .. అనుమానాస్పద మృతి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అనుమానాస్పదంగా నీటిలో మునిగి పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణం సుభాష్ నగర్ కు చెందిన పేర్ల నితిన్ కుమార్ (22) పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు కళ్లెం రోహిత్ తో కలిసి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. రాత్రి ఇంటికి రాక పోయే సరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తాత ఇంటి వద్ద ఉన్నానని ఇక్కడే పడుకుంటానని చెప్పాడు. తిరిగి ఉదయం నితిన్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో నితిన్ కుమార్ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు వెతికారు. ఈ క్రమంలో వెలమ ఫంక్షన్ హాల్ వెనుక తిమ్మికుంట వద్ద నితిన్ కుమార్ చెప్పులు కనిపించాయి. అనుమానంతో తిమ్మికుంట లో వెతకగా నితిన్ కుమార్ శవం దొరికింది. తన కుమారుని మరణంపై అనుమానం ఉందని తండ్రి పేర్ల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed