ప్రాణాలు తీసిన అతి వేగం.. ఇద్దరు మృతి

by Kalyani |
ప్రాణాలు తీసిన అతి వేగం.. ఇద్దరు మృతి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అతి వేగం, అజాగ్రత్త మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన మూడికె మల్లేశం (33) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. దసరా పండుగ కు గ్రామానికి వచ్చిన మల్లేశం ఆదివారం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణ శివారులోని కరీంనగర్ బైపాస్ రోడ్డులోని తమిళనాడు దాబాల వద్ద వేగంగా బైక్ ను నడుపుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బీదర్ కు చెందిన లారీ డ్రైవర్ రసూల్ ఖాన్ (35) ను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటన లో రసూల్ ఖాన్ అక్కడికక్కడే మరణించగా, మల్లేశం కొద్ది దూరం వెళ్లి రోడ్డు పై పడి పోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మల్లేశం అన్న పర్శయ్య వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో మల్లేశంను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. రసూల్ ఖాన్ అన్న అంజత్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed