యాచకురాలిపై నీలకంఠేశ్వరాలయ వాలంటీర్​ విరంగం

by Sridhar Babu |
యాచకురాలిపై నీలకంఠేశ్వరాలయ వాలంటీర్​ విరంగం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాల్లో యాచకం కోసం వచ్చిన ఓ మహిళపై ఆలయానికి సంబంధించిన ఓ వాలంటీర్​ విచక్షణా రహితంగా కొట్టాడు. దాంతో మహిళలకు వాతలు వచ్చాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు వాలంటీర్లను నియమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఓ యాచక మహిళ అక్కడికి భిక్షాటనకు రాగా ఆమెను వాలంటీర్​ భక్తుల మధ్యకు వచ్చిందని వాతలు పడేలా చితకబాదాడు. ఈ ఘటనపై ఆలయ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed