కలెక్టర్ రాకతో అధికారుల్లో చలనం

by Aamani |
కలెక్టర్ రాకతో అధికారుల్లో చలనం
X

దిశ,నిజాంసాగర్: రాజొచ్చే కథ మొదలైదన్న చందంగా మారింది నిజాంసాగర్ ప్రస్తుత ఆసుపత్రి పరిస్థితి. ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేయకపోగా జిల్లా ఉన్నత అధికారి వస్తున్నాడు అంటే ఆసుపత్రిలో హుటాహుటిన పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో బ్లీచింగ్ చేస్తూ, వ్యర్థ పదార్థాలను ఆఘాల మేఘాల మీద తొలగిస్తున్నారు. అధికారులు వస్తే తప్ప ఆసుపత్రి సిబ్బందికి శానిటేషన్ పై ఎంత శ్రద్ధ ఉందో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

ఈ అధికారుల అతి ఉత్సాహం రోజు ఈ విధంగానే ఉంటే ఆసుపత్రికి వచ్చే రోగులు ఎంతగానో సంతోషిస్తారని పలువురు అనుకుంటున్నారు. అధికారులు వస్తే తప్ప ఉద్యోగం ఉన్న సంగతి గుర్తుకు రాని అధికారులు ఎందరో ఉన్నారని మండలంలో సైతం విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆసుపత్రి పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి నిరంతరం ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed