బస్టాండ్​లో ఆటో ఎక్కిన మహిళ అదృశ్యం

by Sridhar Babu |
బస్టాండ్​లో ఆటో ఎక్కిన మహిళ అదృశ్యం
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 13వ తేదీన వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ పేస్ 2 లో నివాసం ఉంటున్న నార్ల అశ్విని భర్త విజయ్ కుమార్తో కలిసి ఈనెల 13వ తేదీన హైదరాబాద్ నుండి వచ్చి కామారెడ్డి కొత్త బస్టాండ్ లో దిగారు.

అనంతరం అశ్విని తన స్నేహితురాలైన అనురాధ వాళ్ల ఇంటికి వెళ్తానని చెప్పడంతో కామారెడ్డిలో ఆటో ఎక్కించి తిరిగి తాను నిజామాబాద్ వెళ్లినట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు విజయ్​కుమార్ తన భార్య అశ్వినికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అశోక్ నగర్ కాలనీలో ఉండే అనురాధ ఇంటికి వెళ్లేసరికి ఇక్కడ తాళం వేసి ఉందని తెలిపారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పీఐ పేర్కొన్నారు. అదృశ్యమైన అశ్వినికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story