బాగిర్తి పల్లి లో భారీ చోరీ

by Sridhar Babu |
బాగిర్తి పల్లి లో భారీ చోరీ
X

దిశ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తి పల్లి గ్రామంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.... గ్రామానికి చెందిన నీల కుమార్ వ్యవసాయ బావి వద్ద పని ఉండడంతో గ్రామ ప్రారంభంలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో స్నానాలు చేసి రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ పనులు పూర్తి కాకపోవడంతో సమీపంలో ఉన్న పాత ఇంటికి వెళ్లి అక్కడే ఉన్నారు.

పొలం వద్ద పనులు పూర్తి కావడంతో మంగళవారం ఉదయం తిరిగి కొత్త ఇంటికి రాగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా దుండగులు బీరువాను ధ్వంసం చేసి బట్టలు చిందరవందరగా కింద పడవేసి, హ్యాండ్ బ్యాగ్ లో దాచి ఉంచిన ఏడున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు, 31 తులాల వెండిని దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ సిబ్బందితో ఘటన స్థలాన్ని సందర్శించారు. సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే సొత్తు ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి క్లూస్ టీం ను రప్పించి వేలి ముద్రలు సేక రించి, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed