టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆల్రేడీ బీసీసీఐకి సమాచారం ఇచ్చిన రోహిత్ శర్మ!

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-10 17:30:05.0  )
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆల్రేడీ బీసీసీఐకి సమాచారం ఇచ్చిన రోహిత్ శర్మ!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒంటిచేత్తో ఆయన గెలిపించిన మ్యాచులు అనేకం ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ గెలుపు అనంతరం.. ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆయన ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో ఓ టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచుల్లో ఒకటి ఆడకపోవచ్చని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందే తన పనులు పూర్తయితే అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. పనులు పూర్తవకపోతే ఒక టెస్టుకు దూరం కానున్నారు. రోహిత్ దూరమైతే జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ అనే కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed