పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి

by Sridhar Babu |
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి  మృతి
X

దిశ, కామారెడ్డి : ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన తోకల నారాయణ (48) అనే వ్యక్తి గత నెల 30న ఎన్నికల రోజు తన ఇంట్లో 4 ఓట్లు ఉండగా కేవలం రెండు ఓట్లకు మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతావి ఇవ్వక పోవడంతో ఇంట్లో వారు ఎవరూ ఓటు వేయలేదు. దాంతో మనస్తాపం చెందిన నారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబం అతన్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed