ఏటీఎం కార్డులు మార్చి చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
ఏటీఎం కార్డులు మార్చి చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఏటీఎం సెంటర్లో అమాయక ప్రజలను మోసం చేసి, వారి ఏటీఎం లను మార్చి డబ్బులను కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా భిక్కనుర్ మండలం జంగం పల్లి గ్రామానికి చెందిన గడ్డమీది రమేష్ ఇటీవల నగరంలోని వన్ టౌన్ పరిధిలోని మూడు ఏటీఎం సెంటర్లో ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.

డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్ లను వచ్చిన అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి వారి ఏటీఎం ను బదిలీ చేసి, వారి అకౌంట్ లో నుండి డబ్బులను దొంగలించే వాడని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మంగళవారం ఉదయం వన్ టౌన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. మూడు కేసుల్లో మొత్తం రూ. 30 వేలు నగదును రికవరీ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు విజయ్ బాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed