బీసీ సీఎం అంటున్న బీజేపీ కే మాదిగల ఓటు

by Sridhar Babu |
బీసీ సీఎం అంటున్న బీజేపీ కే మాదిగల ఓటు
X

దిశ, నందిపేట్ : నందిపేట్ మండల కేంద్రంలోని సాయి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మాదిగల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచ్చేశారు. అంతకు ముందు ప్రత్యేక హెలికాప్టర్ లో లక్కంపళ్లి ఫుడ్ పార్క్ లో దిగారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి, అల్లుడు శశికాంత్ రెడ్డి శాలువా, పుష్ప గుచ్క్ష్మీం ఇచ్చి స్వాగతం పలికారు. సభకు వచ్చిన మందకృష్ణ మాదిగ కు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వాగతం పలికారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్నారు అని, అందుకే ఉన్నత స్థాయి కమిటీ వేశారు అని, అణగారిన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు అని అన్నారు.

బీసీ సీఎం అంటున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. దళిత సీఎం అంటూ కేసీఆర్, దళితుల హత్య చేసిన జీవన్ రెడ్డి కి గుణపాఠం చెప్పాలని అన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గెలుపు లో మాదిగల మద్దతు కూడా ఎక్కువ గా ఉండాలని, వర్గీకరణ పై ప్రధాని ఇచ్చిన హామీ తో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న హామీ నెరవేరుతుంది అని పేర్కొన్నారు. ప్రధాని తనకు సోదరుడితో సమానం అని అన్నారు. దళితుల పట్ల బీఆర్​ఎస్, కాంగ్రెస్ చిన్న చూపు చూశాయని పేర్కొన్నారు. దళితులను హత్య చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి గుణపాఠం చెప్పాలని అన్నారు. రాకేష్ రెడ్డి గెలుపు ఆర్మూర్ కి అవసరం అని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బంగారు శ్రుతి, మైలారం బాలు, ఎంఆర్పీఎస్ నాయకులు పోశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed