అద్దె చెల్లిస్తే తాళం తీస్తా.. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం యజమాని..

by Sumithra |
అద్దె చెల్లిస్తే తాళం తీస్తా.. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం యజమాని..
X

దిశ, తుంగతుర్తి : ఏడాదికాలంగా అద్దె బకాయిలు చెల్లించనందుకు తుంగతుర్తిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నిర్వహిస్తున్న ఇంటి యజమాని మంగళవారం ఉదయం తాళం వేసుకున్నారు. సెలవులు ముగించుకొని పాఠశాల విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రిన్సిపాల్ ఉమారెడ్డితో పాటు ఇతర సిబ్బందిని లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో వారంతా పాఠశాల ముందు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఇంటి యజమాని బత్తుల లాలయ్య మాట్లాడుతూ గత 12 మాసాలుగా ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల అద్దె బకాయిలు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి విసిగిపోవడంతో పాటు చివరకు భవనాలకు తాళాలు వేస్తామని నోటీసులు ఇచ్చామని, అయినా ప్రభుత్వానికి స్పందన లేదని అన్నారు. బకాయిలు చెల్లించిన పిదపనే తాళాలు తీస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed