- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
నగరంలో మరో దారుణం.. ప్రైవేటు కంపెనీ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
దిశ, వెబ్ డెస్క్/శేరిలింగంపల్లి: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికి దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతి రోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఈ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా.. నగరంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి లో నుంచి ఆటోలో వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి రోజులాగే సోమవారం ఆఫీస్కి వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఆటోలో వస్తుంది. ఈ క్రమంలో మసీదు బండ సమీపంలో ఆటోలోనే డ్రైవర్ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.