నగరంలో మరో దారుణం.. ప్రైవేటు కంపెనీ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

by Mahesh |   ( Updated:2024-10-15 04:45:45.0  )
నగరంలో మరో దారుణం.. ప్రైవేటు కంపెనీ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్/శేరిలింగంపల్లి: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికి దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతి రోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఈ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా.. నగరంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి లో నుంచి ఆటోలో వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి రోజులాగే సోమవారం ఆఫీస్‌కి వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఆటోలో వస్తుంది. ఈ క్రమంలో మసీదు బండ సమీపంలో ఆటోలోనే డ్రైవర్ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed