- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కేటీఆర్ వి పిల్ల చేష్టలు
దిశ, నిజామాబాద్ సిటీ : స్వేద పత్రం పేరుతో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పిల్ల చేష్టలు చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రభుత్వ అధికారుల నుంచి వివరాలు సేకరించిన తరువాతే తమ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన శ్వేత పత్రాన్ని తప్పులని బీ ఆర్ఎస్ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారని గుర్తు చేశారు. దమ్ముంటే కేటీఆర్ తప్పులు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు తామే ఇస్తామని, బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు నమూనాను విడుదల చేస్తారని తెలిపారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యూ కట్టాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.