పాకిస్తాన్ లో హింస...11మంది మృతి

by Y. Venkata Narasimha Reddy |
పాకిస్తాన్ లో హింస...11మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌ వాయువ్య ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రావిన్స్‌ లో మరోసారి చెలరేగిన హింసలో ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై కాల్పులు జరపడంతో 11 మంది ప్రయాణీకులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కుర్రం జిల్లాలోని కంజ్ అలిజాయి ప్రాంతంలో ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై మెరుపుదాడి చేశారని కుర్రం డిప్యూటీ కమిషనర్ జావిదుల్లా మెహసూద్ చెప్పారు. గుర్తు తెలియని దుండగులు ప్రయాణికుల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, ఒక మహిళతో సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి వరకు ఈ కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద గ్రూపు బాధ్యత వహించలేదని చెప్పారు.

పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని కుంజ్ అలీజాయ్ పర్వతాలు, అక్కడి రోడ్లపై కాల్పులు జరిగినట్లు కుర్రం డిప్యూటీ కమిషనర్ తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు పాక్‌లో చోటు చేసుకున్నాయి. గత నెలలో ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన అల్లర్లలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటంతో అక్కడి ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story