కవితకు బెయిల్ ఊహించిందే...బీఆర్ఎస్ విలీనమే మిగిలింది

by Sridhar Babu |
కవితకు బెయిల్ ఊహించిందే...బీఆర్ఎస్ విలీనమే మిగిలింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని ముందుగానే ఊహించామని, బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కవడంతోనే బెయిల్ మంజూరైందని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ లు మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి బీఆర్​ఎస్​ పూర్తిగా దాసోహం అయ్యిందన్నారు.

హరీశ్, కేటీఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని, దాని ఫలితమే కవిత కు ఈరోజు బెయిల్ దొరికిందని అన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి వారి కాళ్ల మీద సాగిలపడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ తో బీజేపీ, బీఆర్ఎస్ ల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్న విషయాన్ని ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed