తుమ్మల సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు

by Sridhar Babu |
తుమ్మల సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోనికి వలసల పరంపర కొనసాగుతుంది. హైదరాబాద్ లో మంత్రి తుమ్మల సమక్షంలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీర్కూర్ మండలం నుండి గురువారం సుమారు 20 నుండి 30 వాహనాల్లో సుమారు 300 మంది వరకు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ

బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నుండి తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని బాన్సువాడ నియోజకవర్గంలో బలోపేతం చేస్తానని, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీర్కూర్ జెడ్పీటీసీ తనబుద్ది స్వరూప, కిష్టాపూర్ ఎంపీటీసీ ఎర్ర భారతి, భైరాపూర్ సొసైటీ చైర్మన్ ఉప్పునూతల రామకృష్ణ గౌడ్, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, భైరాపూర్, మల్లాపూర్, తిమ్మాపూర్, వీరాపూర్, అన్నారం, కిష్టాపూర్ గ్రామాల మాజీ సర్పంచ్ లు గుమ్మ అంజవ్వ, రాంసాని పోషవ్వ, కొరిపెల్లి రామకుమారి, ఎర్రోళ్ల సాయిరాం, మునిగెల కిష్టారెడ్డి, పుల్లేని బాబురావు సీనియర్ నాయకులు కమ్మ సత్యనారాయణ, కొరిపెల్లి రాంబాబు, తనబుద్ది శ్రీనివాస్, దండు గంగాధర్, బొగడమీది హన్మాండ్లు, అమ్ముల రాంబాబు, గుమ్మ లక్ష్మన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed