మత్తుమందు చల్లాడు.. బంగారం దోచుకెళ్లాడు

by Sridhar Babu |
మత్తుమందు చల్లాడు.. బంగారం దోచుకెళ్లాడు
X

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెండాగల్లి లో గల శివ దుర్గ బంగారు దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణపు యజమానిపై మత్తు మందును ప్రయోగించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. తనకు బంగారపు ఆభరణాలు కావాలని మాటలలో దింపి యజమానిపై మత్తుమందు చల్లగా యజమాని స్పృహ తప్పి

పడిపోవడంతో బంగారు ఆభరణాలు గల బాక్స్ ను దొంగ దోచుకుని వెళ్లిపోయాడు. యజమాని తేరుకునే లోపు వ్యక్తి బంగారం బాక్స్ తీసుకొని పరరాయ్యాడు. యజమాని బంగారం పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed