నందిపేట్ లో గంజాయి పట్టివేత

by Sridhar Babu |
నందిపేట్ లో గంజాయి పట్టివేత
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలోని వివేకా నంద చౌరస్తా వద్ద భారీ స్థాయిలో గంజాయిని ఆర్మూర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద ఓ బైకుపై గంజాయిని తరలిస్తున్న వారిని పట్టుకొని వారి వద్ద నుండి 3.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

నందిపేట్ వివేకానంద చౌరస్తా గుండా గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఆర్మూర్ రూరల్ పోలీసులు సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై రాహుల్ లు గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన జిలకర ప్రసాద్, విద్యాసాగర్ లు గంజాయిని తరలిస్తూ నందిపేట్ మండల కేంద్రంలో పట్టు బడడంతో ఆర్మూర్ రూరల్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed